వెయ్యి కోట్లు ప‌క్కా అంటోన్న అర్జునుడు

వెయ్యి కోట్లు ప‌క్కా అంటోన్న అర్జునుడు

Published on Jun 29, 2024 6:01 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ భారీ అంచనాల మ‌ధ్య జూన్ 27న ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరుకి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. కాగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

క‌ల్కి మూవీలో మ‌హాభారతానికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో కురుక్షేత్ర యుద్ధంలోని స‌న్నివేశాలు ఉన్నాయి. అర్జునుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ కేమియో పాత్ర‌లో క‌నిపించి స‌ర్ప్రైజ్ చేశారు. ఇక తాజాగా క‌ల్కి సినిమాను ప్రేక్ష‌కుల‌తో క‌లిసి వీక్షించాడు ఈ స్టార్ హీరో.

”ఇప్పుడే సినిమా చూశాను.. ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేదు.. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి సంతోషిస్తున్నా.. ఇండియ‌న్ సినిమాను కొత్త లెవెల్ కు తీసుకెళ్లింది.. ఈ సినిమా ఖ‌చ్చితంగా వెయ్యి కోట్లకు పైగా క‌లెక్ట్ చేస్తుంది.” అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు