SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ స్టార్ట్‌పై క్లారిటీ వచ్చేసింది!

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ స్టార్ట్‌పై క్లారిటీ వచ్చేసింది!

Published on Oct 9, 2024 5:52 PM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి చూపులు ఉన్న సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబు అండ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్‌పైనే ఉన్నాయని చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి చేయబోయే సినిమా కావడం.. మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా రానుండటంతో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా పట్టాలెక్కించలేదు.

దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ ఇప్పటికే మేకోవర్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. అయితే, తాజాగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందనే విషయంపై స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా SSMB29 చిత్రం జనవరి 2025లో స్టార్ట్ అవుతుందని తెలిపారు.

దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా సంతోషం నెలకొంది. ఈ సినిమాను కొత్త సంవత్సరంలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించబోతుందని.. ఈ సినిమాకు సంబంధించిన భారీ క్యాస్టింగ్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు