త్రిష, కుష్భు లపై కేసు వేసిన ప్రముఖ నటుడు.!

త్రిష, కుష్భు లపై కేసు వేసిన ప్రముఖ నటుడు.!

Published on Dec 9, 2023 9:02 AM IST

గత కొన్ని రోజులు కితం తమిళ నాట రిలీజ్ అయ్యిన పాన్ ఇండియా చిత్రం “లియో” రిలీజ్ అయ్యి భారీ వసూళ్లుగా అందుకుంది సినిమా యూనిట్ అంతా హ్యాపీ. కానీ ఆ సినిమా హీరోయిన్ త్రిష విషయంలో అదే సినిమాలో నటించిన కోలీవుడ్ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి.

దీనితో అతని వ్యాఖ్యలు ఖండిస్తూ అనేకమంది సినీ ప్రముఖులు త్రిష కి అండగా నిలబడగా వారిలో మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా తన గళమెత్తారు. అయితే ఈ తర్వాత తాను చిరు సహా త్రిష మరియు నటి కుష్బూలపై తనని అవమానించినందుకు కేసు వేస్తానని చెప్పుకొచ్చిన మన్సూర్ ఇప్పుడు అన్నంత పని చేసాడు.

మొదటి ఒకటి రెండు పేర్లు చెన్నై లో ఉండే వ్యక్తులుగా త్రిష, కుష్బూ పేర్లని చేర్చగా తర్వాత చిరు పేరు కూడా పెట్టాడు. దీనితో తాను ఫైల్ చేసిన కేస్ కాపీ ఇప్పుడు వైరల్ గా మారింది. మద్రాసు జ్యూడిషరీ హై కోర్ట్ లో ఫైల్ చేసిన ఈ కేసు మరి ఎలా ఎక్కడవరకు వెళుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు