అలా ఏమాత్రం ఆలోచించవద్దు – సూర్య

అలా ఏమాత్రం ఆలోచించవద్దు – సూర్య

Published on Sep 23, 2024 5:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య సినీ ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు. ‘మెయ్యజగన్‌’ (తెలుగులో ‘సత్యం సుందరం’) ఈవెంట్‌లో పాల్గొన్న సూర్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘అభిమానులు, అలాగే సినీ ప్రియులు ఎవరైనా సరే.. సినిమాని ఒక సినిమాలా చూడండి. అప్పుడే సినిమాని ఎంజాయ్ చేయగలం. కథ, కథనం, మ్యూజిక్‌, ఎమోషన్స్‌, కామెడీ.. ఇలా ప్రతీదాన్ని ఎంజాయ్‌ చెయ్యొచ్చు. కానీ, ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ గురించి ఏమాత్రం ఆలోచించవద్దు’ అని సూర్య కామెంట్స్ చేశారు.

సూర్య ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక అభిమానిగా సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలి తప్ప.. దానిలో ఉన్న తప్పొప్పుల గురించి రివ్యూ చేయడంపై దృష్టి పెట్టకండి. అది సినిమాని ఎంజాయ్ చేయనివ్వదు’ అని సూర్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సూర్య చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘మెయ్యజగన్‌’ విషయానికి వస్తే.. తమిళంలో ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌ మూవీని తెరకెక్కించిన సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. తెలుగులో ‘సత్యం సుందరం’ సినిమాగా సెప్టెంబరు 28న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు