సంక్రాంతికి కూడా రిలీజ్ అవ్వకపోతే నేరుగా ఓటీటీకే ?

సంక్రాంతికి కూడా రిలీజ్ అవ్వకపోతే నేరుగా ఓటీటీకే ?

Published on Nov 21, 2020 11:13 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలు గందరగోళంలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి. కానీ రామ్ ‘రెడ్’ మాత్రం ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అన్నారు గాని, అప్పుడు కూడా గ్యారెంటీగా రిలీజ్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. మరోపక్క రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ పట్టు పట్టినట్లు ఉన్నాడు.

నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు. అయితే సంక్రాంతికి అన్ని కుదిరితే నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్. కానీ సంక్రాంతికైనా ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతే ఇక నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారట. మరి చివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు