రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో ఇంతకుమునుపే హైదరాబాద్లో శిల్పకళావేదిక వద్ద విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతి హాసన్, వంశీ పైడిపల్లి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బ్రహ్మానందం, దిల్ రాజు, అల్లు అరవింద్, సాయి కుమార్, దేవి శ్రీప్రసాద్ తదితరులు ఉన్నారు. చిరంజీవి మొదటి ఆడియో సి.డి ను ఆవిష్కరించి రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు అందజేశారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ “రెండేళ్ళ క్రితం ఈ సినిమా కధ వినగానే తనని కౌగిలించాకోకుండా ఉండలేకపోయాను. ఈ సినిమా నిజంగా ఒక అద్బుతం. నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఇలాంటి స్క్రిప్ట్ వస్తుందని అనుకోలేదు. మరోసారి ‘మగధీర’ వంటి సినిమా చెయ్యలేకపోవచ్చు కానీ ‘ఎవడు’ నాకు చాలా నచ్చిన సినిమా. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంగా వున్నానని” తెలిపాడు. వంశీ తన గతంలో రెండేళ్ళనుంచి జరిగిన విషయాలను తలుచుకుని బృందానికి తన కృతజ్ఞతలు తెలిపాడు. “అల్లు అర్జున్ ఈ పాత్ర చెయ్యాలని పట్టుబట్టాను. అతను కనిపించేది 5నిముషాలే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమా మెగా ఫాన్స్ ను అలరిస్తుందని” తెలిపాడు.
ఘనంగా విడుదలైన ఎవడు ఆడియో
ఘనంగా విడుదలైన ఎవడు ఆడియో
Published on Jul 1, 2013 10:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య పాత్ర పై ఇంట్రెస్టింగ్ బజ్
- థాయ్లాండ్ నుండి తిరిగొచ్చిన ఎన్టీఆర్
- ‘కల్కి 2898 AD’లో నా పాత్ర అదే – ప్రభాస్
- వారి కోసం రాజమౌళి టెస్ట్ షూట్స్
- యాక్షన్ మూడ్ లో ‘విశ్వంభర’..!
- “ఓజి” ప్రొడ్యూసర్ తో పవన్ కళ్యాణ్!
- భవిష్యత్ లో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా – నాగార్జున
- యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ‘బడ్డీ’ ట్రైలర్