డిజిటల్ ప్రీమియర్ కి “యేవమ్” రెడీ!

యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన యేవమ్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాందిని నటించిన మరో చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అదే తేదీన విడుదలైంది. అయితే రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. యేవమ్ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకుడు. వశిష్టసింహ విలన్‌గా నటించాడు. మర్డర్ మిస్టరీ డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని కలిగి ఉంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. నవదీప్ మరియు పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రానికి కీర్తనా శేష్ మరియు నీలేష్ మందలపు సంగీతం అందించారు. భరత్ రాజ్, అశు రెడ్డి ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version