సాయి ధరమ్ తేజ్ కోసం రంగంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్

సాయి ధరమ్ తేజ్ కోసం రంగంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్

Published on Dec 5, 2022 8:49 PM IST

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న తన కెరీర్ 15వ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యాక్షన్ సస్పెన్స్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ ని డిసెంబర్ 7 న ఉదయం 11 గం. లకు రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ తెలిపింది. కాగా ఈ టైటిల్ టీజర్ కి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో బైట్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసారు. మొత్తంగా సాయి తేజ్ మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండడంతో ప్రస్తుతం ఈ న్యూస్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఈ మూవీ టైటిల్ టీజర్ పై అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు