బాలయ్యతో కలిసి సిఎం చంద్రబాబుకు చెక్కులు అందజేసిన విశ్వక్, సిద్ధు!

బాలయ్యతో కలిసి సిఎం చంద్రబాబుకు చెక్కులు అందజేసిన విశ్వక్, సిద్ధు!

Published on Sep 12, 2024 9:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. అయితే తాము ప్రకటించిన విరాళాలను నందమూరి బాలకృష్ణ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు యంగ్ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్ధు జొన్నలగడ్డ.

వరద బాధితుల సహాయార్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు రాష్ట్రాలకు వీరు విరాళం అందించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు